ఎన్నికల వరకే రాజకీయాలు
ఆ ఉద్దేశంతోనే బరిలోకి దిగాం
కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులను కలుస్తాం
నిధులు ఇవ్వకపోతే వదిలిపెట్టాం
హైదరాబాద్: కరీంనగర్ మేయర్ పీఠం(Karimnagar Mayor) భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల వరకే రాజకీయాలు.. ఈ తర్వాత రాజకీయాలు పక్కనపెట్టాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగామని సూచించారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులనూ కలుస్తామని తెలిపారు. బీజేపీ మేయర్ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వదిలేదని లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో తాము గెలిచినా... మేయర్ గా ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు చేశాయని ఆరోపించారు.




