13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఎన్నికల వరకే రాజకీయాలు

16-02-2026 02:54 PM

ఆ ఉద్దేశంతోనే బరిలోకి దిగాం

కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులను కలుస్తాం

నిధులు ఇవ్వకపోతే వదిలిపెట్టాం

హైదరాబాద్: కరీంనగర్ మేయర్ పీఠం(Karimnagar Mayor) భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల వరకే రాజకీయాలు.. ఈ తర్వాత రాజకీయాలు పక్కనపెట్టాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగామని సూచించారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులనూ కలుస్తామని తెలిపారు. బీజేపీ మేయర్ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వదిలేదని లేదని స్పష్టం  చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో తాము గెలిచినా... మేయర్ గా ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు చేశాయని ఆరోపించారు.