18-10-2025 10:35:10 AM
గద్వాల : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్(BC Bandh) తలపెట్టింది. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో జేఏసీ పిలుపుమేరకు గద్వాల జిల్లాలో అన్ని రాజకీయపార్టీలు బంద్ కు సహకరించాలని కోరుతూ శుక్రవారం రోజు ర్యాలీ నిర్వహించాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం గద్వాల ఆర్టీసి డిపో ముందు బీసీ జేఏసీ ఆందోళన చేపట్టింది. బీసీ బంద్ నేపథ్యంలో పోలీసులు బారీ బందోబస్తు చేపట్టారు. బంద్ నేపథ్యంలో డిఫోలకే బస్సులు పరిమితం కావడంతో రావణ స్తంబించిపోయింది.