30 May, 2026 | 1:09 AM

అధిక ఉష్ణోగ్రత.. అప్రమత్తంగా ఉండాలి

30-05-2026 12:25 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 29 (విజయక్రాంతి): భూపాల పల్లి జిల్లాలో నమోధవుతున్న అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత 46.2 C నమోదైందని తెలిపారు. వాతావరణ శాఖ ముందస్తు సూచనల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. జిల్లాలో తీవ్రమైన వేడి పరిస్థితులు కొనసాగుతున్నందున ప్రజ లు అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు.