17-06-2025 12:06:31 AM
మనస్తత్వాన్ని చాటుకున్న హరీశ్రావు
మంత్రి దామోదర రాజనర్సింహ...
హైదరాబాద్ (విజయక్రాంతి): వైద్యవిద్యను నాసిరకంగా మార్చి.. ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్రావుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) మండిపడ్డారు. ‘మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమంటే పేపర్ల మీద జీవోలు ఇచ్చుడు కాదు..కాలేజీకి బిల్డింగుండాలె.. ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా హాస్పిటల్ ఉండాలె.. ఫాకల్టీ ఉండాలె.. హాస్పిటల్లో, కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలె.. విద్యార్థులకు హాస్టల్స్ ఉండాలె..ఇలా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తేనే కాలేజీ ఏర్పాటు చేసినట్టు’ అని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి చురకలంటించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం గాల్లో మేడలు, కాగితాలపై కాలేజీలను చూపించి, వైద్య విద్యను గత ప్రభుత్వం నాసిరకంగా మార్చిందన్నారు. ఇప్పుడు కాలేజీలకు ఎన్ఎంసీ నోటీసులు రాగానే దొంగ ఏడుపులు ఏడుస్తూ, పిల్లలను తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేలా ట్వీట్లు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నోటీసులే రానట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్టుగా వ్యవహరిస్తూ.. హరీశ్రావు మరోసారి తన గోబెల్స్ మనస్తత్వాన్ని చాటుకున్నారని దామోదర విమర్శించారు. వైద్యవిద్యను గాడినపెట్టే బాధ్యత తమపై ఉందన్నారు