calender_icon.png 7 June, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీ ట్యాక్స్ రెండింతలయింది

05-06-2025 01:26:34 AM

  1. గతంలో 10 శాతముంటే.. అది 20 శాతానికి చేరుకుంది
  2. బీ ట్యాక్స్ చెల్లించకుంటే బిల్లులు ఇవ్వడం లేదు
  3. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాం తి): రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు జరగాలంటే గతంలో ఉన్న 10శాతం కమీషన్ ఇప్పుడు 20శాతంగా మారిందని... బీ ట్యాక్స్ చెల్లించకుంటే బిల్లులు ఇవ్వడం లేదని, మాజీ సర్పంచులు 20శాతం కమీషన్లు ఇవ్వకపోవడం తోనే వారి బిల్లులు విడుదల కావడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ. వెయ్యి కోట్లకు పైగా ఉన్న బిల్లులను చెల్లించాలం టే కాంట్రాక్టర్లు రూ. 200 కోట్ల ముడుపులు చెల్లించాలేమో అని ఆయన ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. చిన్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచుల బిల్లులను క్యాబినెట్‌లో చర్చించి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాలేజీలు మూత పడుతున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదని, ప్రభుత్వం తీరును చూస్తుంటే ఈ పథకాన్ని ఎత్తేయాలని చూస్తుందేమోననే అనుమానం కలుగుతోందన్నారు. ప్రభు త్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం అయినట్టు అనిపిస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రూ. 10వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.