calender_icon.png 8 June, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీని విమర్శిస్తే ఊరుకోం

05-06-2025 01:24:59 AM

  1. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోదీ ఆపరేషన్ సిందూర్ నిలిపేశారు
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు  

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఆపరేషన్ సిందూర్‌ను ఆపడంపైనే తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అభ్యంతరం చెప్పా రని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. రాహుల్‌గాంధీ ఎక్కడా కూడా ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించలేదని, ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని  తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ..

ఆపరేషన్ సిందూర్‌కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా ప్రధాని మోదీ పాకిస్థాన్‌ను ఏమి చేయలేకపోయారన్నారు. కేంద్రం చేసిన తప్పుకి రాహుల్‌గాంధీని పాకిస్థాన్ ఏజెంట్ అనడం సరికాదని, ఆయన భారత ప్రజల ఏజెంట్ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ముందు అఖిలపక్ష సమావేశం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీని అవమానిస్తే ఊరుకోమని వీహెచ్ హెచ్చరించారు.