05-06-2025 01:27:03 AM
- అక్రమ రవాణా దందాలో హస్తం నేతలు?
- ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన క్యాడర్ వ్యవహారం
నిజామాబాద్, జూన్ 4 (విజయ క్రాంతి) : ఉమ్మడి జిల్లాలో ఇసుక లొల్లి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇరకాటంలో పెడుతోంది ఇసుక తవ్వకాల్లో నేతలు పడుతున్న పోటీ తో.. కొత్త తలనొప్పులు వస్తున్నాయని సద రు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులుగా చెప్పుకునే కొందరు నేతలు ద్వితీయ శ్రేణి నాయకులు మంజీరా ను చెరబట్టి అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తున్నారనీ పత్రికల్లో పలు కథనాలు ప్రచురణ అవు తున్నాయి.
ఎమ్మెల్యేల పేర్లు చెప్పి తవ్వకాలు చేస్తుంటే.. ఇదెక్కడి పంచాయతీ అంటూ తలలు పట్టుకుంటున్నారు సదర్ ఎమ్మెల్యే లు ఆ ఎమ్మెల్యేలు...ఇంతకీ ఆ జిల్లాలో ఇసు క పంచాయతీ ఏంటి సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ఇసుక దం దా జోరుగా నడుస్తోంధని స్థానికులు ఫిర్యా దు చేస్తే వారిని హెచ్చరిస్తున్నారని ఇసుక ముఠాపై మీడియా ముఖంగా పలు గ్రామా ల్ల పౌరులు ఆరోపిస్తున్నారు.
అధికారహస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు.. ఈ దందాను నడిపిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరికొంత అనుచర గణం వం దల్లో లారీలను పెట్టి ఇసుక దందా దందా చేస్తున్నారూ ఆ పార్టీలో ముఖ్య నేతలు. మంజీరా పరివాహాక ప్రాంతంలో క్వారీల్లో తవ్వకాలకు అనుమతులు నిలిపివేసినా దొం గ చాటున పొరుగు రాష్ట్రాలకు, హైదరాబాద్ కు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది అప్పుడప్పుడు అధిక లోడుతో అక్రమ ఇసుక ఇస్తున్న వాహనాలను పట్టుకుంటున్నారు.
అక్క డే ఉంది కిటుకు పట్టుకున్న వాహనాలను సీజ్ చేయకుం డా ఆత్మీయ అధికారులకు అప్పగించడంతో తూతు మం త్రంగా జరిమానా విధించి వాహనాలను వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్ధానిక అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకుని వందల లారీల్లో ఇసుక రవాణా చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో అధికారిక క్వారీలను స్ధానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు ఫిర్యాదుతో గతంలో మూత పడగా ప్రస్తు తం ఆయన అనుచరులు దొంగ చాటున ట్రాక్టర్లలో తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి రాత్రి వేల్ల్లో టిప్పర్ల ద్వార తరలిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.
ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బాన్సువాడలోను అక్రమ ఇసుక రవాణా స్దానిక ఎమ్మెల్యే పోచారంకు తలనొప్పిగా మారింది అభివృద్ది పనుల పేరు తో ఓ యువ నేత ముఖ్య అనుచరులు బీర్కూర్ క్వారీలో రాత్రి వేలల్లో తవ్వకాలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం జిల్లా యంత్రాంగానికి చేరింది. ఎమ్మెల్యే పేరు చెప్పి ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే అనుచరులు.
ఇక బోధన్ లోనూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అనచురులు ఇసుక దందాలో రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు బలంగానే ఉన్నాయి. మూడు పాయింట్లలో స్దానిక అవసరాల పేరిట తవ్వకాలు చేస్తున్నారూ. పెద్ద ఎత్తున అక్రమ ఇసుక దందా జరుగుతోందని విమర్శలు రావడంతో ప్రస్తుతం తవ్వకాలను నిలిపివేశారు. ఇసుక దందాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ఈ విషయం జిల్లా ప్రజల్లో చర్చానీయాంశంగా మారింది. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించా ఆదేశించడంతో ఇసుక దందాపై నిఘవర్గాలు దుష్టించాయి.
ఎమ్మెల్యేలు ఇసుక దందాల్లో తలదూర్చొద్దంటూ చెప్పా రాష్ట్ర స్థాయిలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో బోధన్, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలిచ్చరు. ఆ ఆదేశాలను అలుసుగా తీసుకుని ద్వితీయ శ్రేణి నేతలు ఒక ట్రాక్టర్ అనుమతి తీసుకుని వందల కొద్ది ట్రిప్పుల తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సంఖ్యలో ట్రాక్టర్ల ద్వార తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోందట.
అనుమతి లేని ప్రాంతాల్లోనూ రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపిస్తున్నారనే విమర్శలు బహిరం గంగానే వెళ్ళు వెతుతున్నాయి. ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ పోలీసు అధికారులు అక్రమ రవాణా అడ్డుకోకుండా ఇసుక వ్యాపారులతో చేతులు కలుపుతున్నారట. ఇసుక తవ్వకాలు అక్రమ రవాణా వ్యవహారం రాష్ట్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంతో ఎమ్మెల్యేల కు చుట్టుకోవడంతో ఆ దందా వద్దే వద్దూ అంటూ కొందరు ఇసుక తవ్వకాలు ఇపివేయగా మరికొందరు నిబంధన ప్రకారం తవ్వుకోండి కానీ బద్నాం కాకుండా చూసుకోండని క్యాడర్కు హితవు చెబుతున్నారు.
స్ధానక అవసరాల పేరిట జరిగే తవ్వకాలపై ప్రభుత్వం సైతం నిఘా పెట్టింది. ఈ ఇసుక దందాపై ఎప్పటికప్పుడు ఇగో సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందిస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుని ఈ దందా నడిపిస్తున్నారా కార్యకర్తల ఒత్తిడితో ఊ కొడుతున్నారా అన్న అంశాన్ని తేల్చే పనిలో సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. అధికారులు మూడు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలే ఇసుక వ్యాపారుల అవతారం ఎత్తి ఎమ్మెల్యేల కంట్లో నలుసుగా మానడం గమనించదగ్గ విషయం. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ దందా నడుస్తుందా.లేదా అన్నది తేల్చే పనిలో ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయి. ఇసుక మరకలు మంచిదేనా కాదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.