10-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 9 (విజయక్రాంతి): ఇంట్లో భార్యాభర్తల గొడవ కారణంగా భర్త ఇంట్లో నుంచి కోపంగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో భార్య స్పందించి పోలీస్ కాల్ 100కు డయల్ చేయడంతో వారు ఆ వ్యక్తిని కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సారంగాపూర్ మం డలంలోని చించోలి(బి ) గ్రామానికి చెందిన గట్టు నరేష్ శనివారం రాత్రి 8:00 గంటల సమయంలో భార్యతో గొడవ పడి పురుగు ల మందు డబ్బా తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళాడు,
దీంతో తన భార్య గట్టు జ్యోతి 100 నంబర్కు ఫోన్ చేసి విషయం తెలుపగా, వెంటనే బ్లూ కోర్టు విధి నిర్వహణ లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఊరు శివారు అం తా వెతికి చివరకు ఫోన్ లొకేషన్ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించి అతని వద్ద ఉన్న మందు డబ్బాను లాక్కొని, ప్రాణం విలువ గురించి చెప్పి, చివరకు అతనికి నచ్చజెప్పి తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళకి అప్ప చెప్పి ప్రాణాన్ని రక్షించడం జరిగింది,దీంతో కథ సుఖాంతం అయ్యింది.