అనురాగ్ అధ్యాపకుడు డాక్టర్ సి.మల్లేశకు ప్రథమ ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డు
రూ. 5,000 నగదు బహుమతి, ప్రథమ ప్రశంసాపత్రం ప్రదానం
ఘట్కేసర్, జూన్ 26 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సి. మల్లేశ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 7వ వార్షిక సదస్సులో ప్రథమ ఉత్తమ పరిశోధనా ప త్రం అవార్డును అందుకొని విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలిచారు.
విక్సిత్ భారత్ 2047 ఏఐ యుగంలో వాణిజ్యం మేనేజ్మెంట్లో కొత్త కోణాలు అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు ఈనెల 25న కాకతీయ యూనివర్సిటీ, వరంగల్లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
వివిధ విద్యాసంస్థల నుండి వచ్చిన అనేక పరిశోధనా పత్రాలలో ఉత్తమంగా ఎంపికైన ఐదు పత్రాలకు అవార్డులు ప్రదానం చేయగా డాక్టర్ సి. మల్లేశ సమర్పించిన పరిశోధనా పత్రం ప్రథమ స్థానం సాధించింది. ఈ సం దర్భంగా ఆయనకు రూ. 5వేల నగదు బ హుమతి, ప్రథమ ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. ఈఅవార్డును తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ డి. చెన్న ప్ప అందజేశారు. అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది డాక్టర్ సి. మల్లేశని అభినందించారు.






