6 July, 2026 | 4:20 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

మెరుగైన వైద్యసేవలు అందించాలి

08-09-2025 12:10 AM

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 07(విజయక్రాంతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్, మేల్ వార్డుల్లో అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంత రం పలువురు రోగులతో మాట్లాడారు.

ఏ అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చారని, ఇక్కడ సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. తం గళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝాఆదేశించారు.