calender_icon.png 16 June, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి యాడ్స్ సంస్థ మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలి

15-06-2025 05:26:44 PM

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని..

ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించిన బస్సు షెల్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్ధం భద్రాద్రి యాడ్స్ సంస్థ స్వచ్చందంగా బస్సు సెల్టర్లను నిర్మించి ప్రజలకు అంకితం చేయడం అభినందనీయమని, ఈ సంస్థను ఆదర్శనంగా తీసుకొని ఇతర సంస్థలు, ఆర్ధిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు తమ సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ క్రాస్ రోడ్డు, ఇల్లందు, పాల్వంచ క్రాస్ రోడ్డులో భద్రాద్రి యాడ్స్ సంస్థ నిర్మించిన మూడు బస్సు షెల్టార్లను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ... బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి వారికి నీడ కల్పించాలనే సదుద్దేశంతో బస్సు షెల్టార్లను నిర్మించారని, వీటి నిర్వహణ భాధ్యత గ్రామపంచాయతీలకు, అధికారులకుంటుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని 13 ప్రధాన సెంటర్లలో బస్సు షెల్టర్ల నిర్మాణంకోసం నిధులు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఎంపిడివో అంకుబాబు, ప్రొఫెసర్ పూర్ణచందర్ రావు, విద్యుత్ శాఖా ఏఈ రఘురామయ్య, స్థానిక నాయకులు పెదబాబు, కూచిపూడి జగన్, పూనెం శ్రీను, గౌస్ పాషా, కృష్ణ, మిర్యాల రాము, లగడపాటి రమేష్, రామారావు, దేవరగట్ల రాంబాబు, హరి, మండే హన్మంతరావు, భద్రాద్రి యాడ్స్ సంస్థ వ్యవస్థాపకులు డేవిడ్ రాజు, నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు.