15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి

07-12-2025 02:46 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ స్టేడియంలోని  ఈనెల 13వ తారీకు  జరగనున్న తెలంగాణ రేసింగ్ ఉత్సవాల్లో మెస్సి టీం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్  ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలసి ఉప్పల్ స్టేడియం ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్ లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మెస్సి కూడా తెలంగాణ రైసింగ్ చాలా బావుంది దాంట్లో నేను కూడా పాలుపంచుకోవాలని ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ కార్యక్రమంలో మెస్సిపాల్గొనున్నట్ల తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఒక టీం మెస్సి టీంతో  ఆడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెస్సి ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడని  ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా ఇక్కడికి వచ్చిన మెస్సికి సెక్యూరిటీని కల్పిస్తున్నామని తిరిగి వెళ్లే వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రజలు సమయం కన్నా ముందే   రావాలని అలా రావడం వల్ల తొక్కిసేలాటలు జరగకుండా ఉంటుందని మంత్రి భటి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.