13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భక్తులతో భీమేశ్వరస్వామి ఆలయం కిటకిట

20-01-2026 12:00 AM

సమక్క సారలమ్మ జాతర సందర్భంగా తరలివచ్చిన భక్తులు

వేములవాడ, జనవరి19(విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభంతో రాజన్న సిరిసిల్ల జిలా వేములవాడలోని భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు లక్షమందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ఈఓ రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నీడ టెంట్లు,చలువ పందిళ్లు, తాగునీరు,వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రత్యేక డ్యూటీలు కేటాయించారు. కోడె మొక్కుల కోసం వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోడెలు కట్టే ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉద్యోగులు, పోలీసులు, సేవాసమితి సభ్యులు భక్తులకు సేవలు అందించారు.