calender_icon.png 8 June, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి చట్టం పేద రైతుల చుట్టం

24-04-2025 01:28:26 AM

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): గత ప్రభుత్వం భూస్వాముల కోసమే ధరణి తీసుకువచ్చిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగహన సదస్సులో జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గారితో కలిసి  పాల్గొన్నారు. ఈ సందర్బంగా భూ భారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు రైతులకు వివరించారు.

రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, వాటి ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇప్పుడు అలాంటి సమస్యలు తాలేత్తకుండా రైతుల సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు వెల్లడించారు. ధరణి వల్ల పేద రైతులకు న్యాయం జరగలేదని, కేవలం భూస్వాములకే లాభం జరిగిందని తెలిపారు.

ఇప్పుడు పేద రైతులకు న్యాయం జరిగే విధంగా అత్యంత పారదర్శకంగా రైతుల సమస్యల పరిష్కారానికి ధరణి కంటే మెరుగైన చట్టం భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10లక్షల సాదా బైనామా దరఖాస్తులను పరిష్కారానికి భూ భారతి చట్టం ద్వారా మార్గం సుగమం అయిందని తెలిపారు. అలాగే పార్ట్ బీ 18లక్షల ఎకరాలకు సంబందించిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తుందని అన్నారు.

భూ విస్తీర్ణంలో మార్పులు, మిస్సింగ్ సర్వే నంబర్, సవరణలు లాంటి ప్రతి సమస్యకి మీ సేవ ద్వారా కాకుండా స్వయంగా దరఖాస్తు చేసుకునేలా భూ భారతి పోర్టల్ రూపొందించినట్లు తెలిపారు. ప్రతి వ్యక్తి ఆధార్ ఉన్నట్లుగా ప్రతి భూమికి భూదార్ అనే యూనిక్ నంబర్ ఇచ్చి సరిహద్దులు నిర్ణయించి సర్వే మ్యాప్ ని భూ భారతి పోర్టల్ లో అప్డేట్ చేయనున్నట్లు చెప్పారు.  ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా పొందవచ్చు అని అన్నారు.

జూన్ 2 నుండి ఆన్ లైన్ లో భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రామచంద్రగుడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి భూమి పూజ చేశారు. కన్నాయ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శిలాఫలక శంకుస్థాపన చేశారు. కంచనపల్లి గ్రామంలో 50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ శిలాఫలక శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా 10 కుటుంబాలకు చెందిన బిఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ మారుజోడు రాంబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మండల అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్, బొల్లం అజయ్, నమాల బుచ్చయ్య, మార్కెట్ డైరెక్టర్లు ఎండి బాష మియా, బంద కుమార్, తోటకూర రమేష్, మేకల నరేందర్, గొట్టం భాస్కర్ రెడ్డి, గోరిగే రవి, మహేందర్ రెడ్డి, లొనే శ్రవణ్, నీలం యువరాజ్, చెంచు రమేష్, లొనే రవీందర్, నారగొని కుమార్, మీనుముల వెంకట్ రెడ్డి, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్, ఆర్డివో, తహసీల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.