24-04-2025 01:29:38 AM
కరీంనగర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): ఇంటర్మీడియట్ పలితాలలో స్నేహ వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ పలితాలు సాందించారు. ఎం పీ హెచ్ డబ్ల్యూ విద్యా సంవత్సరంలో తయ్యాబా ఫాతిమా 941 మార్కులు, నూనె శ్రావణి 915, ఎం ఎల్ టి లో పత్రి నిర్మదా 856 మార్కులు, మెరుగు పూజ 816, ఈట్ లో రేణికుంట ప్రేమ్ కుమార్ 796, కొండ్ల శ్రీరామ్ 744 మార్కులు సాధించారని కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దుగ్యాని వెంకటేష్ తెలిపారు.
ఎం పి హెచ్ డబ్ల్యు ప్రథమ సంవత్సరంలో కొంకటి హర్షిత 466, పెందెల శైలజ 433, ఎం ఎల్ టిలో సయ్యద్ అనాస్ 433, ఎలవేని అనూష 399, ఈటి లో గాజుల హర్షవర్థన్ 439, గట్టు దివ్య 370 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, దేవెందర్ బత్తిని రాదవేణి, చిదురాల జ్యోతి, మాచర్ల శశికుమార్, దేవేందర్, కోయల్కర్ శివ, అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.