03-06-2025 10:47:36 PM
బోథ్ (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రెండ్లపల్లె గ్రామానికి చెందిన ఆత్రం సోమన్న, సిడం గంగారాంలు నిషేధిత గంజాయితో మంగళవారం మార్కెట్లో తిరుగుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇరువురిని తనిఖీ చేయగా వారి వద్ద 150 గ్రాముల గంజాయి పట్టుబడిందని తెలిపారు. నిందితులను స్టేషన్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.