14-05-2025 01:34:41 AM
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మే 13 (విజయ క్రాంతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ మండలం సైదాపూర్ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామపంచాయతీ భవనంలో, బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు. రైతులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్లు కనకయ్య, శ్రీనివాస్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.