calender_icon.png 2 June, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత

31-05-2025 07:14:49 PM

హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills)లో నూతన తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఆచార్య జయశంకర్(Acharya Jayashankar), బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు(KCR) ఫోటోలతో తెలంగాణ జాగృతి బ్యానర్ ఏర్పాటు చేశారు. కేసీఆర్, కవిత మినహా ఇతరుల ఫోటోలకు జాగృతి బ్యానర్ లో లేవు. జాగృతి కొత్త ఆఫీసులో డా. బీఆర్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్, మహాత్మ జ్యోతిబాపులే, సావిత్రి బాయి పులే విగ్రహాలు, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్థూపం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అని కూడా అనరు అని, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా సీఎం జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు. 

జై తెలంగాణ అనని, అమరవీరులకు నివాళులు అర్పించని వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని కవిత ఆరోపించారు. యువ వికాసానికి రాజీవ్ గాంధీ పేరు ఎలా పెడతారు..? అని ప్రశ్నించారు. పీవీ నరసింహారావు, కాళోజీ, బాపూజీ, శ్రీకాంతాచారి లాంటి వార్ల పేర్లు పెట్టాలని కవిత కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు తీసుకెళ్తున్నారని, ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తామంటే రేవంత్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ఆమె విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. గోదావరి-కావేరీ లింకేజీతో నదీ జలాలు తెలంగాణకు శాశ్వతంగా దూరం అవుతున్నాయని, జూన్ 2న నదీ జలాలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని, అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. అది కాళేశ్వరం కమిషనా..? కాంగ్రెస్ కమిషనా..? అని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నోటీసులను నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహాధర్న నిర్వహించి, ధర్నాలో నోటీసుల కుట్ర మొత్తం వివరిస్తామని కవిత చెప్పారు. 

గుత్తేదార్లకు ఎలా వంత పడుతున్నారో, కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ప పక్కకు పెట్టారో వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ, జాగృతి అంటే కేసీఆర్ కు రెండు కళ్ల వంటివని, తమ నాయకుడిపై ఈగ వాలినా ఊరుకోబోమని కవిత హెచ్చరించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. జాగృతి ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని ముందుకెళ్తామని, బీసీ బిల్లులు పెట్టడంలో జాగృతి, యూపీఎఫ్ పాత్ర ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి సెగ తగిలేలా రైల్ రోకో చేపడతామని కవిత వ్యాఖ్యానించారు. జాగృతి తరపున మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీల కోసం పోరాడి సాధిస్తామని, అన్ని వర్గాల కోసం విభాగాలు ఏర్పాటు చేసి వారి కోసం పోరాడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఓర్వలేని కొంత మంది చాలా మాట్లాడుతున్నారని, జూన్ 4న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నా పోస్టర్ ను కూడా కవిత ఆవిష్కరించారు.