31-05-2025 04:41:02 PM
నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూభారతి పథకం(Bhu Bharati Scheme) ద్వారా ప్రజలకు రెవెన్యూ సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా అందించేందుకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయని తాహసీల్దార్ హరి కిషోర్ శర్మ(Tahsildar Hari Kishore Sharma) అని అన్నారు. శనివారం నాగారం తాహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ... నాగారం మండలంలో అన్నీ రెవెన్యూ గ్రామములలో తేదీ: 03.06.2025 (మంగళవారం) నుండి 16.06.2025 వరకు సమయం: ప్రతి రోజు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగును(షెడ్యూల్ జతపరచనైనది). కావున రైతులు గ్రామ సభలు నిర్వహించు స్థలాన్ని తెలుసుకొని, సంబంధిత పత్రాలు మరియు ఆధారాలతో కలిసి పాల్గొనగలరు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.