27-10-2025 05:23:34 PM
ఉప్పల్ (విజయక్రాంతి): పోలీస్ అమరవీల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని నేపథ్యంలో కుషాయిగూడ ఏసిపి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కుషాయిగూడ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈసీఐఎల్ నుండి ప్రారంభమై సైకిల్ ర్యాలీ ఏఎస్ రావు నగర్ సిగ్నల్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనని విధి నిర్వహణలో అమరులైన పోలీస్ శాఖలు మనకు స్ఫూర్తి అన్నారు.
పగలు రాత్రి లేకుండా సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూ అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని కొనియాడారు. తీవ్రవాదం ఉగ్రవాదం మతత్వం ధోరణిలో సంఘ విద్రోహ శక్తులు హింసలను పాల్పడుతున్నాయని ఇలాంటి శక్తులను ఎదుర్కొంటూ ఎందరో పోలీస్ సోదరులు వీరమరణం పొందారన్నారు. పోలీస్ అంటేనే పట్టుదల ఓర్పు సహనం అని శాంతి పద్ధతులను కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేదన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఎస్ హెచ్ ఓ భాస్కర్ రెడ్డి ఎస్సైలు సుధాకర్ రెడ్డి వెంకన్న సతీష్ విజయ్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.