28-07-2025 01:26:48 AM
ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు
కుత్బుల్లాపూర్, జులై 27(విజయ క్రాంతి): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ గాంధీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ పై వెళుతున్న ముగ్గురు మైనర్లు ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో శివ(18), సూరజ్ (17), బాలు(17) తీవ్ర గాయాలయ్యా యి.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా శివ మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న సూరజ్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు బీహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.