calender_icon.png 9 June, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుడు బిర్సా ముండా

09-06-2025 06:34:17 PM

సిపిఎం..

ఇల్లెందు (విజయక్రాంతి): గిరిజనుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరుస్తూ, వారి హక్కుల కోసం తుది శ్వాస వరకు ఉద్యమించిన గిరిజన పోరాట యోధుడు భగవాన్ బిర్సా ముండా(Birsa Munda) అని ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లే భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, ఆదివాసీ నాయకులు వజ్జా సురేష్ లు అన్నారు. బిర్సా ముండా 125వ వర్ధంతిని సిపిఎం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఏలూరి భవన్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... బ్రిటిష్ వారిపై గిరిజనులపై విదిస్తున్న అక్రమ పన్నులకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరుస్తూ, ఐక్య పరుస్తూ స్వాతంత్ర కోసం పోరాడిన యోధుడని అన్నారు. నేడు కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం గిరిజనులను  గిరిజనుల పోరాట యోధులను కీర్తిస్తూనే ఆ గిరిజనులను నిలువునా మోసం చేస్తుందని అన్నారు. ఖనిజలు, గనులు పేరిట కార్పొరేట్ కంపెనీ లకు సహజ వనరులను దోచి పెడుతుందని, అడవులపైన ఆ కంపెనీలకు అధికారం కల్పిస్తూ గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతుందని అన్నారు. ఆపరేషన్ కగర్ ముఖ్య ఉద్దేశం కూడా అడవులను కార్పొరేట్ లకు దోచి పెట్టడమే అని అన్నారు. బిర్స ముండా స్ఫూర్తి తో కేంద్ర ప్రభుత్వ గిరిజన అణచి వేత విధానాలకి వ్యతిరేకంగా ఉద్యమించాలని వారి ఆశయ సాధనకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో సిపిఎం నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, పద్మ, యాకుబ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.