బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి
23-05-2024 07:32 AM
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు
సూర్యాపేట, మే22 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరావు కోరారు. బుధవారం సూర్యాపేటలో అభ్యర్ధి ప్రేమేందర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ను నమ్మి గతంలో పల్లాకు ఓటేస్తే స్వార్దం కోసం రాజీనామా చేశాడని అన్నారు. కాంగ్రె స్, బీఆర్ఎస్ అభ్యర్థుల వల్ల పట్టభద్రులకు ఒరిగేది ఏమీ లేదని విమర్శిం చారు. బీజేపీని గెలిపించాలని కోరారు.






