24-06-2025 01:13:40 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ జూన్ 23:(విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్టాచివరి పేదోనికి చేరాలన్న శ్యామ ప్రకాష్ ముఖర్జీ, దీన్ దయాల్, వంటి మహనీయుల ఆశయాలకు, ఆకాంక్షాలకు అనుగుణంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పార్టీ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో పనిచేస్తోంది అన్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షాతన నగరంలో సందీప్ గార్డెన్ లో నిర్వహించిన ఇందూర్ అర్బన్ నియోజకవర్గ కార్యశాలకు ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతుకాంగ్రెస్ గత కుటుంబ పాలన మొత్తం అవినీతి లక్షల కోట్ల కుంబకోణలతో గడిసిందన్నారు. బిజెపి జిల్లా నాయకులు తినేసి కులచారి లక్ష్మీనారాయణ రాజు స్రవంతి రెడ్డి, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.