12 March, 2026 | 10:39 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మెరుగైన కమ్యూనికేషన్ కోసం కిషన్ రెడ్డిని కలిసిన బిజెపి నాయకులు

06-12-2025 07:45 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కమ్యూనికేషన్( సిగ్నల్ ప్రాబ్లం) తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మండల బిజెపి నాయకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి సమస్యను విన్నవించారు. జాతర సమయంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మొబైల్ సిగ్నల్ ప్రాబ్లం ఏర్పడుతుంది. 

దీంతో భక్తులకు అసౌకర్యంగా మారుతుంది. భక్తులకు సిగ్నల్ సమస్య రాకుండా చూడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా, ఆయన సానుకూలంగా స్పందించి, జాతర సమయానికల్లా సిగ్నల్ సమస్య పరిష్కరించాలని టెలిఫోన్ ఆపరేటర్లకు  ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బురుగోజు స్వరూప, ఎక్కల దేవి శ్రీనివాస్, బూర్గోజు నాగరాజు ఎక్కల దేవి మధు, పాశం భరత్ తదితరులు పాల్గొన్నారు.