11 March, 2026 | 10:40 PM

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

11-03-2026 07:47 PM

పాపన్నపేట: వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధారబోయిన కృష్ణ, మాధవి(23)లకు ఒక కుమారుడు ఉన్నారు. కృష్ణ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మాధవి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు.

ఇంటి ఆర్థిక పరిస్థితి సైతం సరిగ్గా లేకపోవడంతో ఈ క్రమంలో మనస్తాపం చెందిన మాధవి మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.