15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చెంచు కుటుంబాలను గుర్తించండి

27-06-2025 11:44 PM

ప్రభుత్వ పథకాలను అందించాలని ఎంపీఓకు బీజేపీ నాయకులు రఘురాం గౌడ్ వినతి

హన్వాడ: చెంచు కుటుంబాలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను వారి దరి చేర్చి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని బిజెపి నాయకులు రఘురాం గౌడ్ అన్నారు. శుక్రవారం ఎంపీవో జగదీష్ కుమార్ కు ఎంపీడీవో కార్యాలయంలో పెద్ద ధర్పల్లి గ్రామంలో 8 చెంచు కుటుంబాలు ఉన్నాయని కేవలం ఒకే కుటుంబం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,  మిగతా వారిని కూడా గుర్తించి అవసరమైన సదుపాయాలను కల్పించాలని కోరారు. చెంచు కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని వారి అవసరాలను గుర్తించి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామంలో చెంచు కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎందుకు వెనుకబాటుకు  గురి అయ్యారో సమగ్ర విచారణ చేసి సదుపాయాలను కల్పించాలన్నారు.