14 July, 2026 | 6:44 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

బిజెపి ప్రజా ప్రతినిధులు, నాయకులకు సన్మానం

10-01-2026 05:16 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో శనివారం ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులను బిజెపి శనివారం ఘనంగా సన్మానించారు.  బీజేవైఎం నాయకులు పొన్నం మణికాంత్ నారాయణరావ్ పల్లి ఉపసర్పంచ్ గా గెలుపొందగా వారిని, గట్టెపల్లి వార్డు సభ్యునిగా గెలుపొందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్ కుమార్ ని, అదేవిధంగా బీజేవైఎం మండల అధ్యక్షులుగా నియామకమైన కొమ్మిడి రాజేందర్ రెడ్డిని, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలిగా నియామకమైన మల్కా భాగ్యలక్ష్మి ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి తో కలిసి బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ సన్మానించారు...ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కందునూరి కుమార్, శేఖర్ మాస్టర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.