17-06-2025 12:44:08 AM
మల్లు నాగార్జున రెడ్డి
మోతే,జూన్ 16:- ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపి విధానాలు దేశానికి ప్రమాదకరమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి విమర్శించారు. సోమ వారం మోతే మండల పరిధిలోని విభాలాపురం గ్రామంలో మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ముఖ్యఅతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కోరారు. రైతాంగానికి వెంటనే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర పరిస్థితులు, అఖిలభారత మహాసభ నిర్ణయాలు అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం అనే అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు క్లాసునుబోధించారు. ఈ శిక్షణ తరగతులలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి తదితరులుపాల్గొన్నరు.