12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

కుక్కల దాడిలో కృష్ణజింకకు గాయాలు

08-08-2024 01:02 AM

నిజామాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లోకి మేతకు వచ్చిన కృష్ణజింకపై కుక్కలు దాడి చేశాయి. గమనిం చిన గ్రామస్థులు జింకను కాపాడి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నందిపేట్ మండలం అన్నారం ఎస్సా రెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలోకి బుధవారం కృష్ణజింక వచ్చింది. మేత మేస్తుండగా వీధికుక్కలు దాడి చేశాయి. గ్రామస్థులు కుక్కల బారి నుంచి జింక ను కాపాడి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, వెటర్నరీ వైద్యుడితో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు. అనంతరం జింకకు వైద్యం చేసి పర్యవేక్షణ కోసం చిన్నాపూర్  అర్బన్ పార్క్‌కు తరలించారు.