17-06-2025 12:10:03 AM
చారకొండ, జూన్ 16 : మండలంలోని శిరుసనగండ్ల శివారులోనీ 182 సర్వే నెంబర్ లో బ్లాక్ గ్రానైట్ తీయుటకు ఇచ్చిన అనుమతలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సోమవారం తహసిల్దార్ సునీతకు శిరసనగండ్ల గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిరుసనగండ్ల గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండానే ఎండి నిజాముద్దీన్ అనే వ్యక్తికి అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు.
బ్లాక్ గ్రానైట్ తవ్వకం వల్ల గ్రామ రైతులకు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రతిపాదిత స్థలం సమీపంలో కోళ్ల ఫారాలు, వ్యవసాయ భూములు ఉన్నాయని, గ్రానైట్ తవ్వకం వల్ల తీవ్రమైన పర్యావరణ కాలుష్యం ఏర్పడి చుట్టుపక్కల రైతులు అనారోగ్యాలకు గురై అవకాశం ఉందని ప్రభుత్వం పునరాలోచించి అనుమతులను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో పసుల శ్రీను, విజయ్, కృష్ణయ్య, సురేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.