24 April, 2026 | 2:39 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు   •   ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం   •   మండేపల్లిలో చలివేంద్రం ప్రారంభం – ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన   •   డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   శంకర్‌ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ   •   సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చలు.. RTC కార్మికుల 3 ప్రధాన డిమాండ్లు ఇవే   •   తిరుమల శ్రీవారికి భారీగా బంగారం విరాళం   •   కారు అదుపుతప్పి బోల్తా.. మహిళ మృతి   •   ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •  

రక్తదాన శిబిరాలు నిర్వహించాలి

25-03-2025 05:22 PM

తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిది కేంద్రంలో రక్తం కొరత తీవ్రంగా ఉందని వెంటనే రక్తదాన శిబిరాలు నిర్వహించి తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని తలసేమియా సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిది కేంద్రంలో తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు 832 మంది ఉన్నారని వీరికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి తప్పనిసరి అన్నారు.

రక్తనిది కేంద్రంలో రక్తం కొరత తీవ్రంగా ఉన్నందున వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. గత వేసవి కాలంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచారని, ప్రస్తుతం వేసవి కావడం, విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో అనేకమంది రక్తదానానికి ముందుకురావడం లేదని దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని ఆయన కోరారు.