గాజాపై బాంబుల వర్షం
26-06-2024 01:13 AM
24 మంది మృతి
గాజా, జూన్ 25: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నది. మంగళవారం తెల్లవారుజామున మూడు వేర్వేరుచోట్ల ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన బాంబుదాడుల్లో కనీసం 24 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ దాడిలో హమాజ్ అధినేత ఇస్మాయిల్ హనియేహ్ సోదరి కూడా మరణించినట్టు గాజా ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు రఫా పట్టణంలోకి చొచ్చుకెళ్తున్నాయి.






