కెన్యా పార్లమెంటుకు నిప్పు
26-06-2024 01:13 AM
భద్రతా దళాల కాల్పుల్లో 5 మంది మృతి
నైరోబీ, జూన్ 2౫: ఆఫ్రికా దేశం కెన్యాలో పార్లమెంటు భవనానికి ప్రజలు నిప్పు పెట్టారు. ప్రభుత్వం పన్నులు పెంచటంతో రెండు వారాలుగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఆందోళకారులు పార్లమెంటును ముట్టడించారు. భద్రతాదళాలతో ఘర్షణకు దిగారు. వారిని అడ్డుకొనేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 5 మంది పౌరులు మరణించారు. ఆ సమయంలో పార్లమెంటులో పన్నుల పెంపు బిల్లుపై సభ్యులు చర్చలు జరుపుతుండటం గమనార్హం.






