calender_icon.png 19 June, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

19-06-2025 01:05:20 AM

-గతేడాది పొరపాట్లను పునరావృతం కానివ్వద్దు 

-ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

-గోల్కొండ కోటలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష

-కొన్ని శాఖల అధికారులు డుమ్మా కొట్టడంతో ఆగ్రహం

కార్వాన్, జూన్ 18 : గోల్కొండ జగదాంబికా బోనాల జాతరకు సంబంధించి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, గత సంవత్సరం జరిగిన పొరపాట్లను పునరావృతం కానివద్దని ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె గోల్కొండ కోటలో హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ మాన్ సింగ్, అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డి, సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్, ట్రాఫిక్ డిసిపి వెంకటేశ్వర్లు, ఎస్బి డీసీపీ అపూర్వరావు, గోల్కొండ ఏసీపి సయ్యద్ ఫయాజ్, గోల్కొండ జగదాంబిక ఆలయ ట్రస్టీ చైర్మన్ చంటిబాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు.

గోల్కొండ బోనాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా పక్కాగా ఏర్పాటులు ఉండాలని ఆదేశించారు. గత ఎడాది కంటే ఈసారి అత్యంత వైభవంగా గోల్కొండ జగదాంబికా ఆలయ బోనాల ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

సమావేశానికి కొన్ని శాఖల అధికారులు రాకపోవ డంతో మున్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో వసంత, ట్రస్ట్ కమిటీ సభ్యులు, నాయకులు ఆకుల చంద్రశేఖర్, సంతోష్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.