18 April, 2026 | 3:56 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు

19-06-2025 01:05 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్

యాదాద్రి భువనగిరి జూన్ 18 ( విజయ క్రాంతి ): ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో అవకతవకలు జరుగుతున్నాయని, బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అసలైన నిరుపేదలకు ఇండ్లు రావడంలేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రచారం చేయాల్సిన అధికారులే పట్టించుకోవడం లేదని కలెక్టర్కు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు వస్తున్న వాటాను తెలియజేయాలని, ఇండ్ల మంజూరి పత్రాలపై ప్రధానమంత్రి ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు.  రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రుణం తీసుకున్న వారికి రుణమాఫీ కాలేదని బిజెపి నేత తెలిపారు. రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ పెట్టి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. 

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కిసాన్ మోర్చా  ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,BJP నాయకులు మెంబర్, వంగేటి విజయ్ భాస్కర్ రెడ్డి, ఏలే చంద్ర శేఖర్, పన్నల చంద్ర శేఖర్, వైజయంతి, ఉమ శంకర్ రావు,పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, డి ఎల్ ఎన్ గౌడ్ , పట్నం కపిల్, దయ్యాలు కుమార్, మంగు నరసింహారావు, రాళ్లబండి కృష్ణ చారి, ఉడుత భాస్కర్, వాస నర్సింగ్ తుమ్మల నాగేష్, రావుల సంతు  మరియు పాల్గొన్నారు,