04-08-2025 01:18:42 AM
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
కోదాడ ఆగస్టు 3 : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కోదాడ పట్టణ వాసులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా తరలి వెళ్లి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు బాగా కురిసి చెరువుల నుండి పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.