calender_icon.png 30 June, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 21న పటాన్‌చెరులో బోనాల పండుగ..

30-06-2025 03:02:01 AM

ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో జులై 21వ తేదీ న నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై ఆదివారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. 

రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవంలో మైనంపల్లి

మనోహరాబాద్, జూన్ 28 :మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలోని సాట్కూరి సాయినాథ్ గృహంలో ఏర్పాటు చేసిన రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎ మ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేణుక ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన భోజన సహ పంక్తి లో కూర్చుని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, తెలంగాణ సర్పంచ్ల ఫో రం అధ్యక్షులు చిటుకుల మహిపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, చేగుం ట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్, బుడ్డ భాగ్యరాజ్, అప్సర్, వెంకటేష్ యాదవ్, జావిద్ పాషా, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.