30-06-2025 02:57:40 AM
కార్వాన్, జూన్ 29: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల్లో భాగంగా గోల్కొండ కోటలో ఆదివారం రెండో బోనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆదివారం తెల్లవారుజాము నుం చే భక్తులు గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో గోల్కొండ కోట కోలాహలంగా మారింది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు భారీగా తరలివచ్చారు.
రెండో బోనం సందర్భంగా ఆదివారం ఉదయం జగదాంబిక అమ్మవారికి నవధాన్యాలతో పటం వేశా రు. అనంతరం సుందరంగా ముస్తాబు చేశా రు. అమ్మవారిని అభిషేకంతో కొలిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోల్కొండ ఆలయ ట్రస్ట్రీ కమిటీ చైర్మన్ చంటిబాబు, ఈవో వసంత, సభ్యులు సంతోష్గౌడ్, శ్రీకాంత్, గిరి ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలోని మహంకాళి అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పూజారి సాయిబాబా చారి, సురేష్ చారి, శ్రీకాంత్ చారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సుమారు 3 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్ల ను దర్శించుకున్నట్లు కమిటీ చైర్మన్ చంటిబాబు తదితరులు తెలియజేశారు.
ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి బోనాల ఉత్సవాలు మొదలైన విషయం తెలిసిందే. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభమైంది. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు.
అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న ముగియనున్నాయి.