12 May, 2026 | 12:27 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

ఘనంగా బోనాల పండుగ

10-08-2025 07:46 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ముత్యాలమ్మ దేవాలయ కమిటీ నిర్వాహకుడు జాటోత్ హరీష్ నాయక్ ఆధ్వర్యంలో ఈసారి ఘనమైన ఏర్పాట్లు జరిగాయి. పోతురాజులు, డప్పు దరువులు, ఆటపాటలతో శివసత్తుల పూనకాలతో బోనాలు సమర్పించారు. ఏడాది కాలం పాటు తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించడంతోపాటు మేకలు, గొర్రెపోతులు, కోళ్లు బలిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.