13 July, 2026 | 4:33 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

కాకర్లపల్లిలో యాదవ్ కులస్థుల అధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు

14-01-2026 03:50 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న యాదవ కుటుంబ సభ్యులు 

మంథని,(విజయ క్రాంతి): యాదవ్ కులస్థుల అధ్వర్యంలో మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో బుధవారం పెద్దమ్మ తల్లికి  బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ బోగి రోజున గ్రామంలోని యాదవ కులాస్థులు కుటుంబ సభ్యులతో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడు కూడా యాదవలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి,  బోనాలు సమర్పించారు. ఆ అమ్మవారి ఆశీర్వాదాల తో గ్రామ ప్రజలు, పిల్లజెల్ల, పడిపాశువులు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.  ఈ బోనాల వేడుకల్లో స్థానిక సర్పంచ్ కలవేన కొమురయ్య యాదవ్ తో పాటు కుల పెద్దలు అధిక సంఖ్యలో యాదవ్ లు పాల్గొన్నారు.