1 May, 2026 | 10:54 PM

Breaking News

మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి   •   ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు   •   హనుమాన్ మాలాదారుల గిరిప్రదక్షిణ   •   సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే   •   మాజీ మంత్రి పువ్వాడను కలిసిన సోయం వీరభద్రం   •   ప్రిన్సిపల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన దీప కాసరగడ్డ   •   కలం కార్మికులే సమాజానికి దిక్సూచి   •   రైతన్న ఆందోళన చెందకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా నష్టపరిహారం ఇప్పిస్తా ఎమ్మెల్యే   •   ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి   •   మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకై పోరాటాలు ఉదృతం చేయాలి   •  

7న "కలవార" పుస్తకావిష్కరణ

02-12-2025 08:13 PM

సిద్దిపేట క్రైం: ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో కవి మహమూద్ పాషా రచించిన “కలవార” కవిత్వ సంకలనం పుస్తకావిష్కరణ సభ నిర్వహిస్తామని తెలంగాణ రచయితల వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ సభలో కొత్త కవిత్వ ధోరణులు, సాహిత్య సృజన, సమకాలీన కవిత్వ ప్రవణతలు వంటి అంశాలపై చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. పుస్తకావిష్కరణకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్కపెల్లి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు మహమూద్ పాషా, ప్రధాన కార్యదర్శి స్రవంతి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.