02-02-2026 12:00:00 AM
పాకిస్థాన్ కీలక నిర్ణయం
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 1 : టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగాటోర్నీలో భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటిం చింది. ఫిబ్రవరి 15న భారత్తో జరిగే మ్యాచ్ ఆడొద్దని పాకిస్థాన్ ప్రభుత్వం తమ క్రికెట్ జట్టును ఆదేశించింది. దీంతో తమ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీమిండియాతో మ్యాచ్ ఆడడం లేదని పాక్ బోర్డు తెలిపింది. టోర్నీ లో మిగిలిన మ్యాచ్ లు ఆడతామని వెల్లడించింది. ఐసీసీ ద్వంద్వ వైఖరి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ పాక్ బోర్డు చెబుతోంది.
నిజానికి పాక్ బోర్డు వైఖరి మొ దటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తమ కు సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకున్న పీసీబీ బంగ్లాదేశ్కు మద్ధతుగా నిలిచింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా ముస్తాఫిజుర్ రహమా న్ను ఐపీఎల్ నుంచి తప్పించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోగా.. వారి స్థా నంలో స్కాట్లాండ్కు అవకాశం వచ్చింది. అయితే బంగ్లా మ్యాచ్లు కొలంబోలో నిర్వహించాలంటూ పాక్ బోర్డు హడావుడి చేయడం విమర్శలకు దారితీసింది.
ఒకదశలో బంగ్లాకు మద్ధతుగా టోర్నీని బ హిష్కరించాలంటూ ఆలోచన చేసినా వెనక్కి తగ్గింది. ఇప్పుడు తమ ప్రభుత్వంతో చర్చించి టీమిండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే పాకిస్తాన్ నిర్ణయంతో భారత్ కు మ్యాచ్ ఆడకుండానే 2 పాయింట్లు రానున్నాయి. ప్రస్తుతం లీగ్ స్టేజ్ మ్యాచ్ కావ డంతో పెద్దగా ప్రభావం ఉండదు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ లేదా ఫైనల్స్ లో భారత్ తో ఆడాల్సి వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.