17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పిల్లర్ గుంతలో పడి అన్నాదమ్ముల మృతి

15-05-2025 12:02 AM

మేడ్చల్, మే 14 (విజయక్రాంతి): పిల్లర్ కోసం తీసిన గుంతలో పడి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో జరిగింది. గద్వాల జిల్లా కు చెందిన సుజాత దంపతులు జీవనోపాధి కోసం ఉప్పల్ వచ్చి, స్థానిక కురుమనగర్‌లో ఉంటూ, ఫ్లుఓవర్ బ్రిడ్జి ని ర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి మణికంఠ(15), అర్జున్(8) కుమారులు.

మంగళవారం తమ కుమారులు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. కాగా ఉప్పల్ భగాయత్‌లో కుల సంఘా ల భవన నిర్మాణానికి పిల్లర్ గుంతలు తీశా రు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతలో నీరు చేరింది. బుధవారం ఆ గుంతలోనే అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత డీఆర్‌డీఎఫ్ సిబ్బంది గాలించగా మణికంఠ మృతదేహం కూడా బయటపడింది.