calender_icon.png 13 August, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టాలి

13-08-2025 02:25:17 PM

కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ ప్రధాన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిషన్ మోర్చా ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం పాత సీఎం ఆఫీసు క్రాస్ రోడ్డు దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడారు. గుంతల మయమైన రహదారి నిర్మాణం జరిగే వరకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్యాచ్ వర్క్ చేపించాలన్నారు.

బెల్లంపల్లి పట్టణoలోని రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్ నుండి మొదలుకొని కన్నాల ఫ్లైఓవర్ వరకు కొత్త రోడ్డు నిర్మించాలన్నారు. చౌడేశ్వరి, ఏఎంసీ, గాంధీ విగ్రహం, కన్నాలఫ్లైఓవర్ వరకు రోడ్డు గుంతలు పడ్డాయన్నారు. వర్షం పడితే గుంతలో నీరు చేరి వాహనదారులు తీవ్ర అసౌకర్యం గురవుతున్నారని వాపోయారు. తూతూ మంత్రంగా గుంతలను పూడ్చడం కాకుండా శాశ్వత రోడ్డు నిర్మాణం చేయించాలనీ డిమాండ్ చేశారు. దీనికి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్, స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ తక్షణమే చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో చేసే ఆందోళన కార్యక్రమాలకు  అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.