07-08-2025 12:00:00 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): గోదావరి నదిపై ఏపీ సర్కా ర్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని దీనిపై చర్చకు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో బుధవారం వాయిదా తీర్మానం ఇచ్చింది.
సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథార్టీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభు త్వం బనకచర్లను నిర్మిస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి ఆరోపించారు. గోదావ రి నీళ్లను అక్రమంగా వినియోగించుకుంటోందని ఆరోపిస్తూ 267 పద్దు కింద సురేష్ రెడ్డి వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు.
అత్యవసర అంశం అయినందున బుధవారం నాటి సభా కార్యకలాపాలన్నింటినీ రద్దు చేసి బనకచర్లపై చర్చించాలని కోరారు. ఈ తీర్మానాన్ని తోసి పుచ్చిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చర్చకు నిరాకరించారు.