22-09-2025 12:19:56 AM
దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): బిఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం నేరడుగొమ్ము మండలం ధర్మారేఖ్య తండాకు చెందిన 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో చేరారు.
అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ 22నెలల పాలనలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి అని ఆయన అన్నారు.స్థానిక ఎన్నికలలో సత్తాచాటాలి అని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అని తెలిపారు.రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది ఆయన గుర్తు చేశారు.
రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది అని తెలిపారు.కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెచ్చింది అని ఆయన తెలిపారు. రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిషేక్ నాయక్,మాజీ సర్పంచ్ చెన్న నాయక్, బషీర్ ,తదితరులు ఉన్నారు.