calender_icon.png 30 June, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమర్జెన్సీ వార్డులో క్యాండీ క్రష్ గేమ్స్..!

30-06-2025 01:21:00 AM

  1. పేద రోగులకు వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం

క్యూలైన్లో రోగులు ఉన్నప్పటికీ గేమ్ లో లీనమైన వైద్యురాలు 

ఆసుపత్రిపై కొరవడిన పర్యవేక్షణ 

విజయక్రాంతిలో వార్తా కథనంతో వైద్యురాలికి మెమో జారీ 

నాగర్ కర్నూల్ జూన్ 29 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోని వైద్యులు పేద రోగులకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను బయటే నిల్చోబెట్టి వైద్యులు మాత్రం ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డుల్లోనూ తమ స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమింగ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8:40గంటల ప్రాంతంలో విధుల్లో ఉన్న ముగ్గురి వైద్యుల్లో ఆర్తో సర్జన్ డాక్టర్ అయేషా బేగం తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కనిపించింది.

ప్రమాదకర స్థితిలో బెడ్ పై ఉన్న రోగులను కూడా పట్టించుకోకుండా తన కిందిస్థాయి సిబ్బంది మీదే వదిలి తాను మాత్రం ఫోన్ లో లీనమైపోయింది. దీంతో అక్కడికి వచ్చిన రోగులు తమ ఫోన్లో వీడియోను రికార్డ్ చేశారు. దీనిపై విజయక్రాంతి డిజిటల్ మీడియాలో వార్త కథనాన్ని ప్రచురించగా ఆదివారం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు స్పందిస్తూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని వైద్యురాలికి మెమో జారీ చేసినట్లుతెలిపారు.