26 June, 2026 | 6:47 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

సిద్దిపేట-సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో

30-01-2026 12:10 PM

భారీగా నిలిచిన వాహనాలు

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలంలోనీ జక్కాపూర్ గ్రామం వద్ద గల సిద్దిపేట సిరిసిల్ల రహదారిపై మండలంలోని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. మాజీ సీఎం కెసిఆర్ సిట్ నోటిస్ లు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జక్కాపూర్ గ్రామం వద్ద సిద్దిపేట సిరిసిల్ల రహదారి పై బైటాయించిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి హామీలు గాలికి వదిలేసి రాజకీయ కక్షతో తెలంగాణ తెచ్చిన నాయకుల పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కి నోటిస్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.