24 June, 2026 | 2:43 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

యూరియా యాప్ ను తొలగించాలని బీఆర్ఎస్ రాస్తారోకో

22-01-2026 01:22 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించే పంటకు అన్నదాతలు అవస్థల పాలవుతున్నారని బారాస ఆవేదన వ్యక్తం చేశారు రైతుల యూరియా వితరణ పై విధించిన నిబంధనలు సడలించాలని కోరుతూ గురువారం మండల కేంద్రం లోని బస్టాప్ లో వాహనాలను నిలిపివేశారు. ధర్నా చేపట్టి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ యాప్ విధానంతో  నిరక్ష రాసులు అయిన రైతులకు అవగాహన లేక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. యూరియా అందుబాటులో ఉన్న క్షణాల్లో అయిపోతుందని దీంతో ఇబ్బందులు తప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి మర్రిగూడ ఎస్.ఐ మునగాల కృష్ణారెడ్డి తో బాటు, సంఘటన స్థలానికి చేరుకున్న మునుగోడు వ్యవసాయ సహయ సంచాలకులు వేణుగోపాల్  సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి కెల్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం తో నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండలం టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.